April 12, 2015

మహాభారత, భాగవత కాలంలో ప్రాచీన దేశాలు – ఆధునిక ప్రాంతాలు

మహాభారత, భాగవత కాలంలో ప్రాచీన దేశాలు – ఆధునిక ప్రాంతాలు


1)మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం
    -- దేవ్ ధాం ,నేపాల్

2) నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం 
    -- అహోబిలం , ఆంధ్రప్రదేశ్

3) జమదగ్ని మహర్షి ఆశ్రమం 
    -- జమానియా  ఉత్తర్ ప్రదేశ్

4) మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని ) 
    - మహేశ్వర్ ,మధ్యప్రదేశ్

5) శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్కమార్లు క్షత్రియులపై దండెత్తి వారిరక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు ) , కురుక్షేత్రం , దుర్యోధనుని చంపిన చోటు 
   -కురుక్షేత్ర , హర్యానా



6) పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలినిసముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం ) 
   - కేరళ ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం .



7) మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం ) 
   - పశ్చిమ ఒరిస్సా

8) నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం ) 
   - గ్వాలియర్ జిల్లా ,మధ్యప్రదేశ్

9) వ్యాస మహర్షి పుట్టిన స్థలం 
   - ధమౌలి , నేపాల్

10) నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం ) 
    - సీతాపూర్ జిల్లా , ఉత్తర్ ప్రదేశ్


11) వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు 
   - మనగ్రామం , ఉత్తరాంచల్


12) రతిష్టానపురం (పురూరవుని రాజధాని ) 
    - ఝాన్సీ ,అలహాబాద్

13) సాళ్వ రాజ్యం (సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం ) 
   - కురుక్షేత్రం దగ్గర

14) హస్తినాపురం (కౌరవుల రాజధాని ) 
    - హస్తినాపూర్ , ఉత్తర్ ప్రదేశ్

15) మధుపురం / మధువనం (కంసుని రాజధాని )
     - మధుర , ఉత్తర్ ప్రదేశ్

16) వ్రేపల్లె / గోకులం - గోకుల్ 
     -- మధుర దగ్గర


17) కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు ) 
    - గ్వాలియర్

18) మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు ) 
     - పంజాబ్ ప్రావిన్స్ , పాకిస్తాన్

19) ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం ) 
    - డెహ్రాడూన్

20) గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు ) 
    - గురుగావ్ , హర్యానా

21) కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం 
   - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్ )

22) పాండవుల లాక్షగృహ దహనం
   - వర్నాల్ , హస్తినాపూర్



23) కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం 
   - గిర్నార్ ,గుజరాత్

24) శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం 
   - ద్వారక , గుజరాత్
25) హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు ) 
-జలాన్ జిల్లా , ఉత్తర్ ప్రదేశ్

26) విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం ) 
   - విదర్భ , మహరాష్ట్ర

27) కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం ) 
   - కుండినపుర , మహరాష్ట్ర

28) చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం ) 
   - బుందేల్ ఖండ్ , మధ్యప్రదేశ్

29) కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం ) 
   - దాతియ జిల్లా , మధ్యప్రదేశ్

30) ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని ) 
  - ఇంద్రప్రస్థ , ఢిల్లీ దగ్గర


31)  కుచేలుడు నివసించిన చోటు 
   - పోర్ బందర్ , గుజరాత్

32) పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం ) 
   - ఎటాహ్ , సహజహంపూర్ , ఫారుఖాబాద్ ప్రాంతాలు , ఉత్తర్ ప్రదేశ్


33) కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం ) 
   - కంపిల్ , ఉత్తర్




34) జరాసంధుని భీముడు చంపిన చోటు 
    - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి , బీహార్


35) కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు ) 
   - పశ్చిమ హర్యానా


36) మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం ) 
   - ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం ,రాజస్థాన్


37) విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం )
    - విరాట్ నగర్ , రాజస్థాన్


38) శోణపురం (బాణాసురుడి రాజధాని ) 
   - సోనిత్ పూర్ , అస్సాం

39) ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని ) 
   - తేజ్ పూర్ , అస్సాం

40) నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం 
   - ప్రభాస తీర్థం , సోంనాథ్ , గుజరాత్


41) జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం 
   - పర్హాం , ఉత్తర్ ప్రదేశ్


42) కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం ) 
   - నేపాల్ లోని తిలార్కోట్


43) బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం 
   - బోధ్(బుద్ధ) గయ , బీహార్


44) గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు 
    - కుశీనగర్ , ఉత్తర్ ప్రదేశ్


అమృతం అనే ఆయుర్వేద, ఆధ్యాత్మిక పత్రికలో ఉన్న ఈ points ని  నేను చదివాను, నాకు బాగా నచ్చాయి. అందుకే అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ భద్రపరచాను. 

No comments:

Post a Comment