July 1, 2015

తిరుపతి 28 జూన్ (2015)

తిరుపతి 28 జూన్ (2015) కాలినడకన తిరుమల వెళ్ళాము.(నేను, మాపెద్దబ్బాయి, తమ్ముడు-మరదలు- మేనకోడలు & మేనల్లుడు)  


 అలిపిరి వద్ద తొలిమెట్టు 
 తిరుమల చేరుకునే మార్గమధ్యంలో ఉన్న పెద్ద హనుమంతుని విగ్రహం 

 హనుమంతుని ముందు మా పెద్దబ్బాయి & మా మేనల్లుడు 
 హనుమంతుని ముందు నేను 


 మోకాళ్ళ పర్వతం (చుక్కల పర్వతం అని కూడా అంటారు) 

పాపనాశనం
పాపవినాశన తీర్థం, పరమ పావనమైన తిరుమలలో ప్రసిద్ధ పుణ్య తీర్థాలలో ఒకటిగా వెలసింది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపములు నశించి, సకల కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తించును. కావున ఈ తీర్థమునకు ఈ నామము ఏర్పడింది. శ్రీ వేంకటాచల పురాణములలో పేర్కొనబడింది. పాపవినాశనము ఆశ్వీయుజ మాసమందు శుక్లపక్ష సప్తమై ఉత్తరాషాడ నక్షత్రముతో కూడిన ద్వాదశి దినముగాని తీర్థ విశేష దినముగా పాపావినాశనము గురించి స్కందపురాణంలో చెప్పబడింది. ఇచట శ్రీ గంగాభవాని మరియు శ్రీ ఆంజనేయస్వామి విగ్రహములు నెలకొల్పి తి.తి.దే వారి పురోహిత సంఘం సభ్యులచే పూజలు జరుగుచున్నవి.          





పాపనాశనం వద్ద మా మేనకోడలు, నేను, మా మరదలు   

 తిరుమల కొండలపై నుండి చూస్తే తిరుపతి పట్టణం ఎంత అందమగా కనిపిస్తోందో 



రోడ్డు మార్గంలో తిరుమల వెళ్ళేటప్పుడు, మార్గమధ్యంలో తాళ్ళపాక అన్నమయ్య వంశస్థీయులు నిర్వహిస్తున్న (నడుపుతున్న) అన్నమాచార్య సంగీత, సాహిత్య విశ్వవిద్యాలయం కనిపిస్తుంది. అక్కడ నిర్మించిన అన్నమాచార్యుని విగ్రహం.    

కర్నూలు- చిత్తూరు హైవే రోడ్డు మార్గంమధ్యలో, కడపలో ఆలంఖానపల్లెలో....  ఋషివాటిక ఆశ్రమంలో ఉన్న వెంకన్నస్వామి..... ఈ ఆశ్రమ విశేషం ఏమిటంటే ఈ స్వామికి పూజలు చేయటానికి పూజారి ఉండడు. ఎవ్వరైనా వెళ్ళి, వారికి వారే పూజలు చేసుకోవచ్చును, స్వామి పాదాలను తాకవచ్చును.       



ఆశ్రమం వెనుక గోశాల ఉంది. కబేళాలకి తరలించే గోవులను ఆదుకొని, సంరక్షిస్తున్నారు, ఇక్కడ ప్రస్తుతం 35 గోవులు ఉన్నాయి. 



No comments:

Post a Comment