April 22, 2014

కీర్తన భక్తి

కీర్తన భక్తి

భగవంతుని నామ రూప గుణ చరిత తత్వ రహస్యాలను, శ్రద్ధతో, ప్రేమతో కీర్తిస్తూ ఉంటే శరీరం పులకించటం, కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడటం, కంఠం తన్మయత్వంతో గద్గదమవ్వటము, హృదయ ప్రఫుల్లమై విలసిల్లటమే...కీర్తన లక్షణం.

పూర్వం నారదుడు, వాల్మీకి, శ్రీశుకుడు వంటి భక్తాగ్రేసరులు..... ఈ యుగంలో తులసీదాసు, సూరదాసు, తుకారం, మీరభాయ్, నానక్ వంటి ఎందరో భక్తులు కీర్తనభక్తి వలన తరించారు.

నిరంతరం నామకీర్తనలు గావించిన ప్రహ్లాడునుకి, నామకీర్తనతో పాటు, శ్రీరాముని తన హృదయంలో నిలుపుకున్న , హనుమంతునకు సాయుధ్యాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు.

కలియుగంలో శ్రీహరి నామమే సర్వశ్రేయోదాయక సాధనం.

శ్రీరామదాసు, అన్నమయ్య, త్యాగయ్య , క్షేత్రయ్య, జయదేవుడు మొదలైనవారు కలియుగంలో కీర్తనభక్తివల్లననే ముక్తిని పొందారు.


No comments:

Post a Comment