July 11, 2013

సుతీక్షుణుని స్మరణభక్తి

సుతీక్షుణుని స్మరణభక్తి

పూర్వం సుతీక్షుణుడు అనే మహాభక్తుడు, భగవంతుని పట్ల ప్రేమతో నిత్యస్మరణ చేస్తూ, ఆ తన్మయత్వంలో మనస్సులోనే భగవంతుని ప్రతిష్టించుకున్నాడు. కొన్ని సందర్భాలలో తనను తానే మరచి భగవంతుని ధ్యానంలో పరవశిస్తూ, నృత్యం చేస్తూ, పరుగులు తీస్తూ, నవ్వుతూ, తుళ్ళుతూ ఆనంద లోకాలలోకి విహరిస్తూ ఉండేవాడు. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు అతని హృదయంలోనే నివాసమేర్పరచుకొని అతనిని తరిమ్పచేసాడు.

ఇదే విధంగా సనకసనందాది మునులు, ధృవుడు, భీష్ముడు, కుంతీ శబరి, జటాయువు వంటి భక్తులు స్మరణతో తమ జన్మలను పరిమ్పచేసున్నారు. శబరి, జతాయువులకు శ్రీమహావిష్ణు అవతార పురుషుడైన శ్రీరాముడే స్వయంగా ఉత్తర కర్మలను నిర్వర్తించి తన భక్తులపట్ల భగవంతునకు గల అభిమానాన్ని ప్రదర్శించాడు.

నేటి పరిస్థితులలో ఎన్ని పనుల ఒత్తిడి ఉన్నా మనస్సును ఇతర వ్యాపకాలకు దూరంగా ఉంచి, కేవలం భగవంతుని స్మరించటంలోనే తరించే మార్గముందని తెలుసుకొని, తరించే ప్రయత్నం చేద్దామా.


No comments:

Post a Comment