July 8, 2013

కీర్తన భక్తి:--

కీర్తన భక్తి:--

భగవంతుని నామ రూప గుణ చరిత తత్వ రహస్యాలను, శ్రద్ధతో, ప్రేమతో కీర్తిస్తూ ఉంటే శరీరం పులకించటం, కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడటం, కంఠం తన్మయత్వంతో గద్గదమవ్వటము, హృదయ ప్రఫుల్లమై విలసిల్లటమే...కీర్తన లక్షణం.

పూర్వం నారదుడు, వాల్మీకి, శ్రీశుకుడు వంటి భక్తాగ్రేసరులు..... ఈ యుగంలో తులసీదాసు, సూరదాసు, తుకారం, మీరభాయ్, నానక్ వంటి ఎందరో భక్తులు కీర్తనభక్తి వలన తరించారు.

నిరంతరం నామకీర్తనలు గావించిన ప్రహ్లాడునుకి, నామకీర్తనతో పాటు, శ్రీరాముని తన హృదయంలో నిలుపుకున్న , హనుమంతునకు సాయుధ్యాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు.

కలియుగంలో శ్రీహరి నామమే సర్వశ్రేయోదాయక సాధనం.

శ్రీరామదాసు, అన్నమయ్య, త్యాగయ్య , క్షేత్రయ్య, జయదేవుడు మొదలైనవారు కలియుగంలో కీర్తనభక్తివల్లననే ముక్తిని పొందారు.


No comments:

Post a Comment