దశరా నవరాత్రులలో ఐదవరోజు స్కందమాత అవతారవిశేషములు
(5) స్కందమాత
సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ||
(5) స్కందమాత
సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ||

దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది.పద్మాసనాదేవి అనికూడా అంటారు. ఈమె వాహనం సింహవాహనం.ఈమెను ఉపాసించిన సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందుతారు. స్కందమాతను పూజించిన స్కందభగవానుని కూడా పూజించినట్లు అగును. సూర్యమండలమునకు అధిష్టానదేవి యగుటచే, ఈమెను పూజించిన ఉపాసకులు తేజోవంతులగుదురు. ఈ సంసారసాగర దుఃఖముల నుండి విముక్తి చెంది మోక్షమార్గము చేరుటకు వేరే ఉపాయము లేదు.
ఐదవరొజు నైవేద్యం ------ పెరుగు అన్నం. (దద్ధోజనం) ....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)
No comments:
Post a Comment