October 10, 2013

జమ్మివేట

జమ్మివేట 

అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంట పడకుండా శ్రీకృష్ణుని సలహా మేరకు జమ్మి చెట్టు మీద భద్ర పరిచారు. అజ్ఞాతవాసము  ముగింపులో విజయదశమినాడు పాండవ మధ్యముడు విజయుడు(అర్జునుడు) ఆయుధాలను బయటికి తీసి, పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి, దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీజ శుద్ధ దశమి "విజయదశమి" అయ్యింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతా పూర్వకముగా పూజలు చేసి తమ జీవితం విజయ వంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధ పూజ. 

దసరా పండుగ నాడు సింహాచలంలో నెలకొనియున్న శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారు కొండదిగువనున్న ఉద్యానవనమునకు వెళ్ళి, జమ్మివేట చేసి( అనగా జమ్మి చెట్టుకి బాణం వేసి, కొమ్మని నరుకుతారు). అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. బాణాసంచా వెలిగిస్తారు. తరవాత స్వామివారు వీధులలో తిరువీధి చేసి, కొండపైకి వెళతారు. ఇది దసరానాడు సింహాచలంలో జరిగే పెద్ద ఉత్సవం. 


          

1 comment:

  1. what is jammiveta. i understood aayudha puja, vijayadasimi.

    ReplyDelete