September 25, 2015

నేపాల్ యాత్రా విశేషాలు Part 1 (హైదరాబాద్ నుండి నేపాల్ బోర్డర్ వరకు)

నేపాల్ యాత్రా విశేషాలు  Part 1 (హైదరాబాద్ నుండి నేపాల్ బోర్డర్ వరకు) 
Day  1
సెప్టెంబర్ 04వ తేదీన ఉదయం అమ్మ - నాన్న, తమ్ముడు - మరదలు, మేనకోడలు ఇంకా కొంతమంది స్నేహితులతో ... మొత్తం 22 మంది...... నేపాల్ లో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలని దర్శించటానికి సికింద్రాబాద్ నుండి గోరఖపూర్ రైలులో బయలుదేరాము. 

Day 2

మరుసటి దినం కృష్ణాష్టమి అయ్యింది. మా గ్రూప్ లో ఉన్నవారంతా రైలులోనే ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని, మా రైలుబోగీ అంతా గాలిబుడగలతో అలంకరించి,  తమ్ముడు తీసుకువచ్చిన చిన్నికృష్ణుని విగ్రహం, నాన్నగారి వద్ద ఉండే కృష్ణుని విగ్రహాలు అన్నిటినీ అలంకరించి,  నాన్నగారు & తమ్ముడు పూజలు చేసారు.


రైలులోనే కృష్ణాష్టమి జరుపుకుంటామని ముందే తెలిసిన మాలో కొందరు భక్తులు రకరకాలైన స్వీట్స్ ని తీసుకువచ్చారు. వాటిని నైవేద్యంగా పెట్టి కంపార్ట్మెంట్ లో ఉన్నవారందరికీ పంచిపెట్టాము.   




ఆరోజు సాయంత్రం గం3.30 నిమిషాలకి గోరఖ్పూర్ చేరవలసిన రైలు 4 గంటలు ఆలస్యంగా 7.30 కి చేరింది.

మేం రైల్వే స్టేషన్ కి చేరుకోగానే, మా గైడు వచ్చి మమ్మల్ని బస్ వద్దకు చేర్చి, రాత్రి 12 గంటలు దాటితే నేపాల్ బోర్డర్ లోకి ప్రవేశం ఉండదని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ తీసుకుపోయాడు. కాని బోర్డర్ చేరేసరికి రాత్రి 12.30 నిllలు అయ్యింది. అందువల్ల బోర్డర్ కి ఇవతలే బస్సుని నిలిపేసాడు.



అక్కడ నుండి 1/2 కిలోమీటరు దూరం నడిచాక,  అంటే నేపాలుబోర్డర్ లోకి ప్రవేశించి, ఆ రాత్రికి అక్కడే హోటల్ లో రూమ్స్ తీసుకొని నిద్రించాం.అక్కడ వాతావరణం మన ఇండియా వాతావరణంలాగే చాలా వేడిగా ఉంది.

No comments:

Post a Comment