September 26, 2015

నేపాల్ యాత్రా విశేషాలు Part 9 ఖాట్మండు నుండి నేపాల్ బోర్డర్ కి ప్రయాణం

నేపాల్ యాత్రా విశేషాలు Part 9 ఖాట్మండు నుండి నేపాల్ బోర్డర్ కి ప్రయాణం

ఆ రాత్రి అక్కడే ఉండి, మరుసటిరోజు ఉదయం 6.30కి ఖాట్మండు నుండి నేపాల్ బోర్డర్ కి మాప్రయాణం మొదలయ్యింది. ముక్తినాథ్ లో గండకీనదిని చూడలేదు, నదీ స్నానం చెయ్యలేదు అనే అసంతృప్తి అందరిలోనూ ఉంది. అది గ్రహించిన మా బస్సు డ్రైవరు బబ్లూ మార్గమధ్యంలో బస్సుని ఆపి, ఇక్కడే గండకీనది చివరి స్థానం. ఈ ప్రాంతం దాటితే మనకు గండకీనది కనిపించదు, ఎవరైనా వెళితే వెళ్ళి నదిని దర్శించి రండి అని చెప్పగానే, అందరం చాలా సంతోషంతో నదీమతల్లిని దర్శిద్దామని వెళ్ళాము. ఆరోజు శ్రావణమాసం ఆఖరి శుక్రవారం. గండకీనదిలో స్నానం చెయ్యాలని కోరిక ఆపుకోలేక అందరం స్నానాలు చేసేసాము. 




అందరి మనస్సులు తృప్తి చెందాయి. తిరిగి బోర్డర్ కి ప్రయాణమయ్యాము. బోర్డరుకి వచ్చేసరికి సాయంత్రం 6 అయ్యింది. అందరి వద్ద ఉన్న నేపాలీ కరెన్సీని మళ్ళీ ఇండియన్ కరెన్సీగా మార్చుకొన్నాము. మొత్తానికి నేపాల్ బోర్దరుని దాటి ఇండియాలోకి అడుగుపెట్టాం. రాత్రి 10.30 కి గోరఖ్పూర్ రైల్వేస్టేషన్ కి చేరుకున్నాము. స్టేషను ఎదురుగా ఉన్న హోటల్ లో రూములు తీసుకొని, రాత్రి నిద్రించాము.

Day 9
ఉదయం గోరఖ్పూర్ లో 6.30 కి రైలు ఎక్కాము. 

Day 10
మరుసటిరోజు సాయంత్రం 3.30 కి హైదరాబాదు స్టేషనులో దిగి సంతోషవదనాలతో ఎవరిళ్ళకి వాళ్ళు తిరుగుముఖం పట్టాం. ఇవి మా యాత్రావిశేషాలు.                                                                                        

2 comments:

  1. యాత్రావిశేషాలు ఛక్కగా అక్షరరూపంలో అందరితో పంఛుకున్నందుకు అభినందనలు, ధన్యవాదములు.

    ReplyDelete