December 12, 2013

తిరుప్పావై పాశురాలు --- మొదటి పాశురము

తిరుప్పావై పాశురాలు  -- ధనుర్మాస వ్రత విశిష్టత 

అస్మత్గురుభ్యో నమః 
వందే శ్రీరంగనాయకీమ్ 
ప్రార్థన



శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది

నీళా తుంగస్తనగిరితటి  సుప్త ముద్బోధ్య కృష్ణం 
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్సిద్ద మధ్యాపయన్తీ| 
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే 
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః || 

ఈ  శ్లోకమును పరాశరభట్టరువారు గోదాదేవికి నమస్కార రూపంగా విన్నవించారు. శ్రీకృష్ణపరమాత్మ నీలదేవి యొక్క ఉన్నత స్తనగిరితటములలో నిద్రించినాడు. ఆ నిద్రించిన కృష్ణసింహమును మేల్కొల్పినది గోదాదేవి. అతనికి ఉపనిషత్తులలో ప్రతిపాదించిన తన పరతంత్రతను పాఠము చెప్పినది. తాను అనుభవించి వదిలిన మాలికలతో అతనిని బంధించి బలాత్కారముగా అనుభవించినది. ఆ గోదాదేవికి మరల మరల ఇవే నా నమస్కారములు. 

తనియలు 
శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్| 
యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్|| 
లక్ష్మీనాథ సమారమ్భం నాథ యామున మధ్యమామ్| 
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్|| 

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ 
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే!| 
అస్మద్గురో ర్భగవతో2స్య దయైకసిన్దోః 
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే..|| 

మాతా పితా యువతయ స్తనయా విభూతిః 
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ | 
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం 
శ్రీ మపత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ద్నా.. || 

ఆళ్వారులతనియన్ - శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది || 
భూతం సరశ్చ మహాదాహ్వయ భట్టనాథ 
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ | 
భక్తాంఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్ 
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||

తిరుప్పళ్ళియెళుచ్చి 

తమేవ మత్వా పరవాసు దేవం 
రంగేశయం రాజవదర్హణీయం 
ప్రాబోధికీం యోకృతసూక్తి మాలాం 
భక్తాంఘ్రి రేణుం భగవంతమీడే 

మండం గుడి మెన్బర్ మామఱైయోర్ మన్నియశీర్ 
తొండరడిప్పడి తొన్నగరమ్ వణ్ణు 
తిణర్త వయల్ తెన్న రంగత్తమ్మానై - పళ్ళి 
యుణర్తుమ్ పిరానుదిత్త పూర్

తిరుప్పావైలో  ఒక్కొక్క  పాశురమునందును పళ్ళియెళందరుళాయే అని పడకను విడచి లెమ్మని ప్రార్థించుటచే శ్రీ రంగనాధులను మేలుకొలుపుటనే -రాజవదర్హణీయమ్ అని చెప్పిరి.  దేవాలయాల్లో నేడు  విన్పించే సుప్రభాతములకు ఇదియే నాంది  అని పెద్దల వాక్కు.

1. కదిరవన్ కుణతిశైచ్చిగరమ్ వన్ధణైన్దాన్ 
కనైయిరుళగన్ఱచు కాలైయమ్ పొళుదాయ్ 
మదువిరిన్దోళుగిన మామలరెల్లామ్ 
వానవరరశర్ కళ్ వన్దు వన్దీణ్డి, 
ఎదిర్ దిశై, నిఱైన్ధన రివరొడుమ్ పుగున్ధ 
ఇరుంగళి త్తీట్టముమ్ పిడియెడు మురశుమ్ 
అదిర్ దలిలలై కడల్ పోన్ఱుళదు ఎంగుమ్ 
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె 

2. కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి 
క్కూర్ న్ధదు కుణదిశై మారుద మిదువో, 
ఎళున్ధన మలరణై ప్పళ్ళి కొణ్డన్నమ్ 
ఈన్బనిననైన్ధ తమిరుమ్ శిఱుగుదఱి 
విళుంగియ ముదలైయిన్ పిలమ్బురై పేళ్వాయ్ 
వెళ్ళెయిఱుఱవదన్విడత్తినుక్కనుంగి, 
అళుంగియ వానైయి నరుమ్ తుయర్ కెడుత్త 
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె.. 

3. శుడరొళి పరన్ధన శూళిందిశై యెల్లామ్ 
తున్నియ తారకై మిన్నొళిశురజ్గి. 
పడరొళి పశుత్తనన్ పనిమది యివనో 
పాయిరుళగనదు పెమ్ పోళిఱ్కముగిన్ 
మడిలిడైక్కీఱి వణ్ పాళై కళ్ నాఱ 
వైగఱై కూర్ న్ధదు మారుద మిదువో 
అడలొళి తిగళదరు తిగిరియమ్ తడక్కై 
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే... 

4. మేట్టిళమేదిగళ్ తళై విడు మాయర్ గళ్ 
వేయజ్ఞుళలో శైయుమ్ విడైమణిక్కురలుమ్ 
ఈట్టియ విశైదిశై పరన్ధన వయలుళ్ 
ఇరిన్ధన శురుమ్బిన మిలజ్గైయర్ కులత్తై, 
వాట్టియ వరిశిలై వానవరేఱే 
మాముని వేళ్వియైక్కాత్తు అవపిరదమ్ 
అట్టియవడుతిఱలయోత్తి యెమ్మరశే 
అరంగత్తమ్మా పళియెళున్ధరుళాయే.. 

5. పులంమ్బిన పుట్కళుమ్ - పూమ్ పోళుల్ గళిన్ వాయ్ 
పోయిత్తుంగళ్ పుగున్ధదు పులరి 
కలన్ధదు కుణదిశైక్కనై కడలరవమ్ 
కళివణ్ణు మిళుత్తియ కలమ్బగమ్ పునైన్ధ 
అలంగలన్దొడైయల్ కొణ్ణడియిణై పణివాన్ 
అమరర్ కళ్ పుగున్ధన రాదలిలమ్మా 
ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిల్ 
ఎమ్బెరుమాన్ పళ్ళియేళున్ధరుళాయే... 

6. ఇరవియర్ మణినెడుమ్ తేరొడుమివరో 
ఇఱైయవర్ పదినొరు విడైయరుం ఇవరో 
మరుమియ ముయిలిన నఱుముగ నివనో 
మరుదరుమ్ పశుక్కలమ్ వన్దు వన్దీణ్డియ 
పురవియోడాడలుమ్ తెరుమ్ 
కుమరద్దణ్ణం పుగున్దీణ్డీయ వెళ్ళమ్ 
అరువరైయనై యనిన్ కోయిల్ మున్నివరో 
అరంగత్తమా పళ్ళి యెళున్ధరుళాయే 

7. అన్ధరత్తమరర్ గళ్ కూట్టంగళివైయో 
అరుందవ మునివరుం మరుదరుమివరో 
ఇన్దిర నానైయుమ్ తానుమ్ వన్దివనో 
ఎమ్బెరు మానున కోయిలిన్ వాశల్ 
శున్ధరర్ నెరుక్కవిచ్చాదరర్ నూక్క 
ఇయక్కరుమ్ మాయంగినర్ తిరువడిత్తొళువాన్ 
అన్ధరమ్ పారిడ మిల్లైమత్తిదువో 
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే. 

8. వమ్బవిళింవానవర్ వాయుఱై వళుజ్గ 
మానిది కపిలై యొణ్ కణ్ణాడిముదలా 
ఎమ్బెరుమాన్ పడిమైక్కలమ్ కాణ్డఱ్కు 
ఏర్పన వాయినకొణ్డు నన్మునివర్ 
తుమ్బురునారదర్ పుగున్ధన రివరో 
తోన్ఱిన విరవియమ్ తులంగొళి పిరప్పి 
అమ్బరతలత్తి, నిన్ఱగల్ గిన్ఱ దిరుళ్ పోయ్ 
అరంగత్తమ్మా పళ్ళి యెళున్ధరుళాయే... 

9. ఏదమిల్ తణ్ఱుమై యెక్కమ్ మత్తళి 
యాళుమ్ కుళుల్ ముళువమో డిశైదిశైకైళుమి 
కీదంగళ్ పాడినర్ కిన్నరర్ కరుడర్ గళ్ 
కన్ధరు వరుమివర్ కజ్గలు ళెల్లామ్ 
మాదవర్ వానవార్ శారణర్ ఇయక్కర్ 
శిత్తరుమ్ మయంగినర్ తిరువడిత్తోళువాన్ 
ఆదలిలవర్కునాళో లక్కమరుళ 
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే.. 

10. కడిమలర్కములంగళ్ మరల్ న్ధన వివైయా 
కదిరవన్ కనైకడల్ ముళైత్తన నివనో 
తుడియుడైయార్ శురికుళుల్ పిఱున్దుదఱి 
త్తయిలుడుత్తే ఱినర్ శూళుంపునలరంగా! 
తొడై యొత్తతుళవముమ్ - కూడైయుమ్ పొలిన్దు 
తోన్ఱియతోళ్ తొణ్ణరడిప్పొడి యెన్నుమ్ 
ఆడియనై యళియనెన్ఱరుళియున్నడియార్కు 
అప్పడుత్తాయ్ పళ్ళియెళున్ధరు ళాయే 
తొండరడి యాళ్వార్ తిరువడిగళే శరణం. 

తొండరడిప్పొడి యాళ్వార్ తిరువడి ఘళే శరణమ్ 
(అని నమస్కారము చేయవలెను) అణ్డాళ్ తిరువడిగళే శరణమ్ 

ఆండాళ్ తిరువడిగళే శరణమ్ 

నీలా తుంగస్తన గిరిత సుప్త ముద్బోధ్య కృష్ణం 
పారార్థ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ద మధ్యాపయన్తీ| 
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే 
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః || 

అన్నవయల్ పుదువై యాండా ళరంగఱ్కు 
ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్ 
పాడి కోడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై 
శూడిక్కొడుత్తాళై చ్చొల్. 

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్ పావై, 
పాడి యరుళవల్ల పల్ వళైయాయ్! - "నాడినీ 
వేంగడ వఱ్కెన్నై విది" యెన్ఱ విమ్మాత్తమ్, 
నాంగడవా వణ్ణమే నల్ గు. 

ప్రతీరోజు వ్రతమునకు మునుపు ఈ శ్లోకాలు చదివి అప్పుడు పూజని ప్రారంభించాలి.  
  
ధనుర్మాసము గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం--
      
ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మాసవ్రతంగా చెబుతారు. మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు నెలకోరాశిలో ప్రవేశిస్తుంటాడు. దీనినే  'సంక్రమణం' లేక 'సంక్రాంతి' అంటారు. ఉదా ll సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రమణం ('మేష సంక్రాంతి') అవుతుంది. ధనూరాశిలో ప్రవేశిస్తే 'ధనుస్సంక్రమణం' లేక  'ధనుస్సంక్రాంతి' అవుతుంది. ధనూరాశిలో సూర్యుడు ఒక మాసం ఉంటాడు కనుక ఆ మాసాన్ని 'ధనుర్మాసం' అంటారు.

శ్రీకృష్ణ భగవానుడు "మాసోహం మార్గశీర్షోహం" అని స్వయంగా భవద్గీతలో సెలవిచ్చాడు. ఇది కృష్ణునికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని గోదాదేవి మనకు నిరూపించి చూపింది.

మనకు ఉత్తరాయణం & దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలు ఉన్నాయి. అందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగలుగాను ....... దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణించబడతాయి. అందులో మార్గశిర మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమంట, అంటే బ్రాహ్మీ ముహూర్తమన్నమాట. అందువల్ల ఈ మార్గశిరమాసానికి ఇంత అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకుంది.

ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగలుగాను ....... దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణించబడతాయి. అందులో మార్గశిర మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమంట, అంటే బ్రాహ్మీ ముహూర్తమన్నమాట. అందువల్ల ఈ మార్గశిరమాసానికి ఇంత అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకుంది.

ఇక ధనుర్మాసం వ్రతవిషయానికి వస్తే.... ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పొందగోరిన గోపకన్యలు వ్రేపల్లెలో కాత్యాయినీ వ్రతాన్ని చేశారని విని, తానూ అలాగే చేయాలనుకుంది గోదాదేవి. తాను ఉన్న శ్రీవిల్లిపుత్తూరును వ్రేపల్లెగానూ .... తను ఒక గోపకన్యకగానూ...... తన స్నేహితురాళ్ళను వ్రజ కన్యకలుగానూ భావించి, తానూ గొల్లకన్య రూపాన్ని ధరించి శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయిని శ్రీకృష్ణునిగా భావించి, అతి శ్రేష్టమైన మార్గశిర మాసాన్న -- ధనుర్మాస సమయంలో శ్రీస్వామివారిని నెలరోజులూ అర్చిస్తూ రోజుకొక పాశురాన్ని (పాటని) సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు.

శ్రీగోదాదేవి స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర స్వరూపాలే. వేదోపనిషత్తుల సారాంశమే. నియమనిష్టలతో స్వామిని ఆరాధిస్తే ముప్పై రోజులలో తరుణోపాయం లభిస్తుంది అని చాటిచెప్పింది ఆండాళ్ తల్లి. ఆమె చూపిన మార్గంలో పయనించి, మన జీవితాలను ధన్యం చేసుకుందాం.

వ్రతనియమాలు

1) ప్రతీరోజూ బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, చన్నీటి స్నానం చెయ్యాలి.
2) తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని -- శ్రీలక్ష్మీ అష్టోత్తర సహిత -- విష్ణుసహస్రనామస్తోత్రం , గోదా అష్టోత్తరముతో పారాయణ చెయ్యాలి.
3) ఈవ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించేవారికి, ఎటువంటి ఆటంకాలు కలుగవు.

మొదటి పాశురము

మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !



భావము
ఇది మార్గశిరమాసము. వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణాలుగల పడుచులారా ! ఈ మార్గశిర స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండి, ముందు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధముగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడను, అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడను, ఎర్ర తామరులను పోలిన కన్నులు కలవాడును, సూర్యునివలే ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఇచ్చేటటువంటి దివ్య ముఖమండలము కలవాడును అయినవాడు నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకే, మనసు ఉపేక్షించు వ్రాతసాధనమగు 'పర' అను వాద్యమును ఈయనున్నాడు. మనము ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు, మీరు అందరూ వచ్చి, ఈ వ్రతములో చేరండి.                     
అవతారిక
గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలమగు కాలము మనకు లభించినదే అని, ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు. ఈ వ్రతము చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతము చేసి, తాము పొందదగిన ఫలమేమో, దానిని పొందించు సాధనామేమో స్మరించుచు ఈ పాశురమును పాడుచు ఆనందించుచున్నారు. 


     

No comments:

Post a Comment