December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఏడవ పాశురము

తిరుప్పావై పాశురాలు

ఏడవ పాశురము
కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు ! 
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో  పేయ్ ప్పెణ్ణే ! 
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు 
వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్ 
ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో 
నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి 
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో 
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్. !




భావం:-- 
భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుఝామున కలిసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా !ఓ పిచ్చిదానా ! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులుగల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు, వారిచేతుల కంకణ ధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి, విజ్రుంభించి, ఆకాశామంటుచున్నవి. ఆధ్వనిని వినలేదా ? ఓ నాయకులారా ! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కనపడుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువ వలయును. 

అవతారిక:-
భగవదనుభవము నిత్యనూతనమై మొహపరచుచుండును. పక్షులు తెల్లవారుఝామున మేల్కొంటున్నాయి. ఈనాటి పాశురంలో గోదాదేవి భరద్వాజ పక్షులద్వార, అవిచేసే మధురధ్వనులు ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భారద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్రవిషయాలు తెలుసుకోవలసిందేకదా ! వీటిని తెలుసుకొని భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవీ ఆటంకాలు కావు అని, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతము చేయుటకు రండి అని పిలుస్తోంది.  


No comments:

Post a Comment