December 12, 2013

తిరుప్పావై పాశురాలు ----తొమ్మిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు

తొమ్మిదవ పాశురము 
తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ 
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్ 
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ 
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్ 
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో 
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ? 
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు 
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్ !



భావం:-- 
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మింపబడిన మేడలో సుఖశయ్యపై చుట్టును దీపములు వెలుగుచుండగా అగరుధూపము ఘుమఘుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపు గడియతీయుము. ఓఅత్తా ! నీవైనను ఆమెను లేపుము. నీకుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక జాడ్యము కలదా ? లేక ఎవరైనా కదలిన ఒప్పమని కావలియున్నారా ? లేక గాఢనిద్రపట్టునట్లు మంత్రించినారా ? మహామాయావీ ! మాధవా ! వైకుంఠవాసా ! అని అనేక నామములను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము. 

అవతారిక:-
మొదటి రెండు పాశురములలొ శ్రవణము చెప్పబడింది. తర్వాతి పాశురములో మననము నిరూపింపబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలొ ధ్యానదశ వివరింపబడినది. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగినవారికే తాను లభించే హక్కు కలదు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి మనకు స్వాతంత్ర్యం ఎందుకు ? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి, మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎక్కడికి వెళ్ళక ఉన్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే ధ్యానములో పరాకాష్టపొంది నిద్రిస్తున్న నాల్గవ గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది. ఓ మామకూతురా ! మరదలా లేవమ్మా ! అంటున్నారు.        



3 comments: