November 20, 2013

కార్తీక మహాత్మ్యం -- ఇరవయ్యవ రోజు కథ

కార్తీక మహాత్మ్యం -- ఇరవయ్యవ రోజు కథ 

 కార్తీక మహాత్మ్యం గురించి మునుల మధ్య జరిగిన సంవాదము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిముని అగస్త్యుని చూసి కుంభసంభవా! లోకకళ్యాణం కోసం కార్తీక మహాత్మ్యం గురించి ఒక కథ వినిపిస్తాను విను. వేదంతో సమానమైన శాస్త్రం గాని,హరికి సాటైన దైవం గాని, కార్తీకంతో సమానమైన నెల గాని లేవు.కార్తీక స్నానాలు,దీప దానాలు,భగవత్ స్మరణ వలన సమస్త కోరికలు తీరుతాయి. కలియుగంలో కేవలం దైవభక్తీ వల్ల మాత్రమే సర్వ సంపదలు పొందగలుగుతారు. ఇందుకు ఉదాహరణే  ఈ కథ.

పురంజయుని చరిత్ర 

త్రేతాయుగంలో సూర్యవంశపు రాజైన పురంజయుడు అనే అతను,అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. సర్వశాస్త్ర కోవిదుడు,ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అధిక ఐశ్వర్యం కలగటంతో,అహంకారం కలిగి,బ్రాహ్మణులను ద్వేషిస్తూ,వారి మాన్యాలను లాక్కొని చోరులను చేరదీసి వారి దొంగతనాలు,దోపిడీలు చేయిస్తూ,  ధనంలో సగం వాటా తీసుకొని ప్రజలను భయపెడుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలము గడిచిన పిదప, అతని దౌర్జన్యాలు నలుదిక్కులా వ్యాపించి, సామంతులైన కాంభోజ, కురుజాదులు అనేకమంది ఏకమై, చతురంగ బలాలతో వచ్చి, అయోధ్యను చుట్టుముట్టి నలువైపులా శిబిరములు నిర్మించి, నగరమును దిగ్భంధనము చేసి, యుద్ధమునకు సిద్ధపడిరి.

ఈ వార్త తెలుసుకున్న పురంజయుడు కూడా శతృవులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద - పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినదీ, ధనుర్బాణము మొదలైన శస్త్రాలు వెంట తీసుకొని, అనేక యుద్ధాలలో విజయం సాధించిన గుర్రాలను రథాలకు కట్టి, తమ సూర్యవంశ రథాన్ని అధిరోహించి, చతురంగ బలాలతో శత్రుసైనికులపై విరుచుకు పడ్డాడు.

-:కార్తీక మహాత్మ్యం ఇరువది రోజు పారాయణము సమాప్తము:- 

   

No comments:

Post a Comment